PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్ లో జరిగిన లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం లో ముఖ్యఅతిథిగా కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి భరత్ ,టిడిపి కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షుడు బిటి నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ గా వై. నాగేశ్వరరావు యాదవ్ తో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు .ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి టీజీ  భరత్ మాట్లాడుతూ లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్గా  నాగేశ్వరరావు యాదవ్ ఎన్నిక కావడం అభినందనీయమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శప్రాయమని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 45 వేలకు పైగా లయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్బులు ఉన్నాయని, ఇది సాధారణ విషయం కాదని వివరించారు. వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలను కొంతవరకే చేయగలమని, ఇలాంటి సంస్థల వల్ల సేవా కార్యక్రమాల పరిధి మరింత విస్తరిస్తుందని వివరించారు. ఇలాంటి సంస్థల్లో చేరడం వల్ల సేవ చేయాలన్న ప్రతి ఒక్కరి కోరిక సహకారం అవుతుందని వివరించారు. లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన నేపథ్యంలో నెట్వర్క్ పెరుగుతుందని దీనివల్ల అన్ని ప్రాంతాల వారితో సంబంధాలు నెలకొంటాయని వివరించారు. లయన్స్ ఇంటర్నేషనల్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు .అనంతరం లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ,యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ పాల్గొనడం అభినందనీయమని వివరించారు .అందరి సహకారంతో లయన్స్ ఇంటర్నేషనల్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని వివరించారు .ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author