PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశ భక్తిని పెంపొందించేందుకే నా భూమి-నా దేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: దేశ భక్తిని పెంపొందించేందుకే నా భూమి నా దేశం కార్యక్రమన్ని కేంద్ర,రాష్ట్ర  ప్రభుత్వం  నిర్వహిస్తోందని ఎంపీపీ రాజేంద్రనాధ్ రెడ్డి,ఎంపీడీఓ మల్లేశ్వరి, విఆర్డీఎస్ సురేంద్రరెడ్డి పేర్కొన్నారు.శనివారం వీరబల్లి జిల్లా పరిషత్ హైస్కూలు నందు నా భూమి నా దేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  జన్మ నిచ్చిన నేల తల్లిని, స్వేచ్ఛగా జీవించేందుకు అవకాశం కల్పించిన దేశాన్ని గౌరవించుకునేల చేపట్టిన నా మట్టి నా దేశం కార్యక్రమం ఎంతో మహాన్నోతమైందన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులకు నా మట్టి నా దేశం గురించి వివరించారు.మండలంలోని వివిధ గ్రామాల నుంచి సేకరించిన మట్టిని దేశ రాజధాని ఢిల్లీకి పంపడానికి ఎన్వైకె ప్రతినిధి విఆర్డీఎస్ సురేంద్రరెడ్డికి మట్టి కలశాన్ని ఎంపీపీ,ఎంపీడీఓ లు అందచేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది కుమార్, రాజశేఖర్, వేణు మాధవ్ రాజు, పంచాయతీ సెక్రటరీ చంద్రుడు ,రెడ్డయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.

About Author