PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జైశ్రీరామ్ ఫౌండేషన్ తలపెట్టిన కార్యక్రమం విజయవంతం కావాలి

1 min read

– మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో జైశ్రీరామ్ ఫౌండేషన్ వారు తలపెట్టిన 108 అడుగుల శ్రీరాముని విగ్రహ నిర్మాణ కార్యక్రమం విజయవంతం కావాలని టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు.  జైశ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు 300 కోట్ల రూపాయలతో మంత్రాలయంలో ఏర్పాటు చేయ తలపెట్టిన భారీ విగ్రహా నిర్మాణానికి సంబంధించి ప్రాంతాలవారీగా కమిటీలను ఫౌండేషన్ వారు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కర్నూలు ప్రాంత కమిటీగా ఎన్నికైనటువంటి సభ్యులను ఈరోజు టిజి వెంకటేష్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముని విగ్రహాన్ని చూడగానే రామ రాజ్య పాలన గుర్తుకు వస్తుందన్నారు.  జైశ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ భారీ ప్రాజెక్టుకు పూనుకున్న శ్రీధర్, కే రాము లు అభినందనీయులన్నారు. ఈ కార్యక్రమానికి పూనుకుని ముందుకు వచ్చిన అందరికీ శ్రీరాముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని టీజీ అన్నారు. ఈ కార్యక్రమంలో జైశ్రీరామ్ ఫౌండేషన్ సభ్యులు రక్తం ప్రసాద్, హరికిషన్, శ్రీరాములు, బాలాజీ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author