PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుట్కా విక్రయదారులపై దాడులు

1 min read

– రూ. లక్షా 90వేలు విలువ చేసే ప్యాకెట్లు స్వాధీనం
పల్లెవెలుగు వెబ్​, కడప: జిల్లాలో నిషేధిత గుట్కా విక్రయదారులపై పోలీసులు ముమ్మర దాడులు చేశారు. బ్రహ్మంగారి మఠం పోలీస్​ స్టేషన్​ పరిధిలో గుట్కా విక్రయదారులపై పోలీసులు విస్తృతదాడులు నిర్వహించి రూ. లక్షా 90వేలు విలువ చేసే ప్యాకెట్లు , ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు రూరల్​ సీఐ వెంకట కొండారెడ్డి, బ్రహ్మంగారి మఠం ఎస్సై శ్రీనివాసులు వెల్లడించారు. దాడిలో ముగ్గురిని అరెస్టు చేశారు. భారీ ఎత్తున గుట్కా ప్యాకెట్లు, ముద్దాయిలను పట్టుకున్న మైదుకూరు రూరల్​ సి.ఐ వెంకట కొండారెడ్డి, బి. మఠం ఎస్సై శ్రీనివాసులును జిల్లా ఎస్పీ అన్బురాజన్ అభినందించారు.

About Author