PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ జేసీకి అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: జిఎం మాడ్యులర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ రమేష్ జైన్ ఆదేశాల మేరకు ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ్​ సుందర్​ రెడ్డికి రెండు ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిఎం మాడ్యులర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతినిధులు రూ. లక్షా 36 వేలు విలువ చేసే ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లును వితరణ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జిఎం మాడ్యులర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు కే. శ్రీనివాసులు, డీలర్స్ కే. శ్రీనివాస్ రెడ్డి, దినేష్, మగన్ తదితరులు పాల్గొన్నారు.

About Author