NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేద ప్రజల ఆరోగ్యానికి రక్ష జగనన్న సురక్ష

1 min read

పల్లెవెలుగు వెబ్ వెల్దూర్తి:   పేద ప్రజల ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగనన్న విశిష్టమైన కార్యక్రమాన్ని చేపట్టాడని కి ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ  అన్నారు. క్రిష్ణగిరి మండలం తొగడ్చేడు గ్రామంలో జగనన్న ఆరోగ్య  సురక్ష మెడికల్ క్యాంపును ఎంపిపి డాక్టర్ వెంకటరామి రెడ్డి, జెడ్పీటీసీ కెఈ సుభాషిని వైస్ ఎంపీపీ సుశీలతో కలసి ఎమ్మెల్యే శ్రీదేవమ్మ   పరిశీలించారు. క్యాంపును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో శిబిరానికి వచ్చిన వృద్ధులతో మాట్లాడుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. క్యాంపులో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే శ్రీదేవమ్మ  మాట్లాడుతూ, సిరి ధాన్యాల ప్రాముఖ్యతను వివరించి పేద ప్రజల ఆరోగ్యం కోసమే జగనన్న మన గ్రామీణ ప్రాంతంలోని వైద్యం మన ముందుకు తీసుకొచ్చారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో క్రిష్ణగిరి మండలం వైఎస్ఆర్ పార్టీ నాయకులు తొగడ్చేడు గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

About Author