PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చందోలి లో ఉచిత పశు వైద్య శిబిరం                   

1 min read

పల్లెవెలుగు వెబ్, పత్తికొండ:  రిలయన్స్ ఫౌండేషన్ మరియు పశుసంవర్ధక శాఖ పత్తికొండ శాఖ ఆధ్వర్యంలో గురువారం చందోలి గ్రామంలో  పశువులకు ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు Dr రవి ప్రకాష్ రెడ్డి  పశువైద్యాధికారి Dr లక్ష్మణ్  పాల్గొని పశువులకు ఉచిత వైద్యo అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గారు రవి ప్రకాష్ రెడ్డి పశువుల రైతులకు పలు సూచనలు చేశారు. పశు రైతు లు వైద్యుల సూచన మేరకు మినరల్ మిక్షర్ ఇచ్చినట్లు అయితే పశువులు సకాలంలో ఎదకు వచ్చి కట్టు నిలుస్తుందని తెలిపారు. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ముందుజాగ్రత్తచర్యగా టీకా లువేయించాలని అన్నారు.  రైతులు ఎద లక్షణాలు గమనిస్తూ, లక్షణాలు కనబడగానే రైతులు ఎద సూదులు పశువులు ఆసుపత్రిలో వేయించుకోవాలని రైతులు పశువుల తో పాటు పశువైద్యశాల ను సంప్రదించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో 65 పశువులు, 43 జీవాల కు వైద్యము అందించారు. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎం ప్రకాష్  మాట్లాడుతూ, రైతులు వాతావరణ వర్షము సమాచారము వ్యవసాయ పశు పోషణ సమాచారం కోసం ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 ను సంప్రదించి ఉచిత సలహాలు మరియు సూచనలను పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో  Dr రవిప్రకాష్ రెడ్డి, పశువైద్యాధికారి Dr లక్ష్మణ్, మరియు  సిబ్బంది జ్యోతి, విజయ్, కిషోర్, రవి నాయక్, సురేంద్ర మరియు రిలయన్స్ ఫౌండేషన్ మేనేజర్ ప్రకాష్, జిల్లా ప్రతినిధి నారాయణ, చందోలి గ్రామ రైతులు పాల్గొన్నారు .

About Author