PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చేనేతల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. టి.జి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  టిడిపి అధికారంలోకి వచ్చాక చేనేతల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని జొహరాపురంలోని నేషెగేరిలో గురువారం రాత్రి 10:30 గంటలకు టిడిపి, జనసేన నేతలు కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అన్ని విధాలా అభివ్రుద్దిలో ముందుకు వెళుతుందన్నారు. కర్నూల్లో తాను ఎమ్మెల్యే అయితే ఇక్కడికి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. ఒక్క పరిశ్రమ వచ్చినా వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రజల ఆదాయం కూడా పెరుగుతుందని వివరించారు. కర్నూలులో ఉన్న చేనేతల ఇబ్బందులు తీరుస్తానని చెప్పారు. ప్రజలందరూ ఓట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలన్నారు. కేవలం ప్రజాసేవ కోసమే తాను రాజకీయాల్లో ఉన్నట్లు తెలిపారు. తన తండ్రి హయాంలో చెక్ డ్యాం నిర్మాణం కోసం తీసుకొచ్చి జీ.వోను నేటి పాలకులు పక్కన పెట్టేశారన్నారు. తాను గెలిచిన తర్వాత ప్రజలకు త్రాగునీటి కష్టాలు లేకుండా, రాకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు మోహన్, తిమ్మోజీ శాంతమ్మ, వరలక్ష్మి, జనసేన నేతలు పవన్, చరణ్, అయ్యస్వామి, తదితరులు పాల్గొన్నారు.

About Author