PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాల‌య్య కొడుకు ఎంట్రీ ఫిక్స్.. ఇద్దరూ క‌లిసి..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ అగ్ర హీరో నంద‌మూరి బాల‌కృష్ణ త‌న కొడుకు సినిమా రంగప్రవేశానికి ముహూర్తం ఖ‌రారు చేశారు. బాల‌కృష్ణ స్వయంగా సిద్ధం చేసిన క‌థ‌తో మొద‌టిసారిగా నంద‌మూరి మోక్షజ్ఞ వెండితెర‌కు ప‌రిచ‌యం కాబోతున్నారు. విశేషం ఏమిటంటే.. ఈ సినిమాలో బాల‌కృష్ణ, మోక్షజ్ఞ క‌లిసి న‌టిస్తున్నారు. దీంతో అభిమానులు ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయింది. ఆదిత్య 369 సినిమా ఎలాంటి విజ‌యాన్ని అందించిందో అంద‌రికీ తెలుసు. అలాంటి ఆదిత్య 369 సినిమాకి కొన‌సాగింపుగా ‘ఆదిత్య 999 మ్యాక్స్ ’ పేరుతో సినిమాని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ విష‌యాన్ని బాల‌కృష్ణ ఇటీవ‌ల ఒక ఇంట‌ర్వ్యూలో ప్రక‌టించారు. అయితే.. ఈ సినిమాకి ద‌ర్శకుడు ఎవ‌ర‌నేది ఇంకా తెలియాల్సి ఉంది.

About Author