PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఏర్పాట్లును పరిశీలించిన ఎంఎల్​ఏ

1 min read

శాసన మండలి డిప్యూటీ  చైర్ పర్సన్ జకీయా ఖానం లు

పల్లెవెలుగు అన్నమయ్య జిల్లా బ్యూరో : ఈ నెల 9. వ తేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి   అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటికి  రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లును వైఎస్ఆర్ సిపి  అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ మయానా  జకియా ఖానం ,మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, డి ఎస్ పి మహబూబ్ బాష, ఆర్ అండ్ బి ,మున్సిపల్ అధికారులుతో కలసి వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు.ఈ నెల 9వ తేదీన శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకీయా ఖానం కుమారుని వివాహ రిసెప్షన్ రాయచోటి పట్టణంలోని అభి కళ్యాణ మండపంలోనూ,మరియు మాసాపేటకు చెందిన కీ శే జి ఎం డి రఫీ సోదరుని  కుమార్తె వివాహం పట్టణంలోని రాజధాని కళ్యాణ మండపంలో  జరగనున్నాయి.ఈ వివాహ  కార్యక్రమాలుకు సిఎం జగన్ హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియచేయనున్నారు. ఈ సందర్భంగా పర్యటనా ఏర్పాట్లును శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు.రాజధాని కల్యాణ మండపం వెనుక భాగంలోనే ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ నిర్మాణాల పనులును,హెలిప్యాడ్ నుంచి కళ్యాణ మండపాలకు వెళ్లే రహదారుల మరమ్మత్తు పనులపై అధికారులుతో చర్చించారు. వివాహ వేదికల కళ్యాణ మండపాలను పరిశీలించారు అధికారుల సమన్వయంతో సీఎం పర్యటనను విజయవంతం చేయాలని   ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ సుధాకర్ రెడ్డి , మున్సిపల్ కమీషనర్ గంగా ప్రసాద్, వైఎస్ఆర్ సిపి మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్,ఆర్ అండ్ బి డిఈ వెంకట సుబ్బయ్య ,ఏఈ గిరీశ్వర రావు,మున్సిపల్ ఆర్ ఐ మల్లికార్జున , కౌన్సిలర్లు ఆసీఫ్ అలీఖాన్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, షబ్బీర్,జానం రవీంద్ర యాదవ్,నాసీర్,  బిసి సెల్ విజయ భాస్కర్, జి ఎం డి ఇమ్రాన్, ఇర్షాద్, కో ఆప్షన్ హజరత్ ఖాదర్ వలీ, ఆర్ట్స్ శంకర్,నవాజ్ క్రిష్ తదితరులు పాల్గొన్నారు.

About Author