PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి మృతి…

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : పోలీస్టేషన్ పరిధిలోని లింగంపల్లి గ్రామానికి  చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బెస్త సురేష్ (39) అనే వ్యక్తి శనివారం కోలుకో లేక మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ నాయక్ విలేకరులకు తెలిపారు. సదరు వ్యక్తి పూర్తిగా మద్యానికి బాని సై మానుకోలేక జీవితం పై వరక్తి చెంది ఈ నెల 6న గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డాడు. వెంటనే కుటుంభ సభ్యులు గమనించి అతన్ని ఆదోని ఆ తరువాత కర్నూలు పెద్దాసుపత్రికి తరలించి. చికిత్స చెయించారు. అయితే శనివారం సురేష్ అక్కడ కోలుకోలేక మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ నాయక్ వెల్లడించారు. మృతుడికి భార్య శాంతి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాయక్ వివరించారు.

About Author