PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువగలం ప్రారంభంతో జగన్ రెడ్డి కి వణుకు..

1 min read

వచ్చే ఎన్నికల్లో టిడిపి విజయం ఆపలేరు..

పార్లమెంట్ కార్యనిర్వ కార్యదర్శి ఆవుల పవన్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ కడప : యువగలం పాదయాత్ర తిరిగి ప్రారంభం కావడంతో,,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిందని టిడిపి పార్లమెంటరీ కార్య నిర్వాహ కార్యదర్శి పవన్ రెడ్డి అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులో ఇరికించి 53 రోజులు జైల్లో పెట్టించారని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కేసులు పెట్టారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఐదు కోట్ల మంది ప్రజలు గమనించారని తెలిపారు. ఇసుక సిమెంటు లిక్కర్ మైనింగ్ దోపిడీతో పాటు భూ ఆక్రమణలు పెరిగిపోయాయని చెప్పారు. పోలీసులు కూడా ఫిర్యాదులు తీసుకోవడం లేదని తెలిపారు. ఎన్నికల రూపంలో వీరిని ఇంటికి పంపించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ను సీఎం చేయాలని ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. యువ నేత నారా లోకేష్ ఇవ్వగలం పాదయాత్ర ప్రారంభమైందని, విశాఖలో ముగింపు సభ పెద్ద ఎత్తున చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 160 సీట్లు సాధించడం ఖాయమని పేర్కొన్నారు. పాదయాత్రని దిగ్విజయం చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. 20 సంవత్సరాలుగా జిల్లాను పరిపాలిస్తున్న వైసీపీ నేతలు కనీసం రోడ్లు, కాలువలు కూడా వేయలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. దోచుకోవడం విదేశాల్లో డబ్బులు దాచుకోవడం వైసీపీ నాయకులకు అదే పనిగా మారిందని చెప్పారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

About Author