PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలంగాణ ఎన్నికలు.. ఏపి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు నాంది

1 min read

కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ డి ఎస్ బాషా

పల్లెవెలుగు వెబ్ హోళగుంద:  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు, రానున్న ఎన్నికల్లో ఏపీలో కూడా కాంగ్రెస్ గెలుపుకు నాంది కాబోతుందని కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ డి ఎస్ బాషా అన్నారు.సోమవారం హోళగుంద పట్టణంలోని ఆయన స్వగృహంలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో కె.సి.అర్  నియంత, నిరంకుశ పాలనకు ప్రజలు విసిగిపోయి ఎన్నికల్లో బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీకు పట్టం కట్టారన్నారు. ఏపిలో 2024లో  జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్ అవినీతి, అరాచకాలకు ప్రజలు స్వస్తి చెబుతారన్నారు . కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలు జగన్ సర్కారును గద్దె దింపడం ఖాయమన్నారు.ఈ సమావేశంలో ఆలూరు కాంగ్రెస్ పార్టీ బి సి సెల్ ఇంఛార్జి మంగయ్య, యువనాయకులు ఇబాదుల్ల, హేసన్, ఇక్బాల్ తదితరుల పాల్గోన్నారు.

About Author