PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వికలాంగులు ఆత్మ స్థైర్యంతో ముందుకెళ్లాలి  ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : సమాజంలో విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని పత్తికొండ ఎమ్మెల్యే కంగ్రాటి శ్రీదేవి ఆకాంక్షించారు. సోమవారం మండల కేంద్రం క్రిష్ణగిరిలో విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా క్రిష్ణగిరి, వెల్దుర్తి మండలాల వికలాంగుల ఆత్మీయ సమావేశంలో  ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వికలాంగులు సమాజంలో ప్రతి ఒక్కరు  ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని,భగవంతుని దీవెనలు మీకెప్పుడూ ఉండాలని ఆమె కోరుకున్నారు. ఈ కార్తీకమాసం చివరి రోజున వికలాంగులతో కలవడం ఎంతో సంతోషంగా ఉందని, వికలాంగుల సమావేశ  భవనం నిర్మాణానికి ఐదు సెంట్ల స్థలాన్ని కేటాయిస్తామని ప్రకటించారు. సెక్రేడ్ సంస్థ వారి ఆర్థిక సౌజన్యంతో బోయినపల్లి సూరమ్మ కుమారుడు చింతమాను విజయుడు కి 10 వేల రూపాయలు విలువ గల చెక్కును పంపిణీ చేశారు. అలాగే చెర్లకొత్తూరు లక్ష్మీదేవి, ఎరుకలచెరువు సుజాత కు కుట్టు మిషన్ల ను  ఎమ్మెల్యే  పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి డాక్టర్ వెంకట రామిరెడ్డి,   జెడ్పీటీసీ కెఈ సుభాషిణి ,  సెక్రెడ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ తిప్పన్న,ఎంపీటీసీ మహాలక్ష్మి, వివిధ శాఖల అధికారులు,దివ్యాంగులు పాల్గొన్నారు.

About Author