PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉధృతంగా అంగన్వాడీల ధర్నా..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గత మూడు రోజుల నుంచి తమ న్యాయపరమైన కోరికలు తీర్చాలని పిఎఫ్ గ్రాట్యుటి జీతం పెంచాలని అంగన్వాడి వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు గడివేముల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద మూడవరోజు ధర్నాకు టిడిపి పార్టీ సంఘీభావం ప్రకటించి ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల డిమాండ్లను తీర్చాలని టిడిపి మండల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు.. అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధంగా ఉన్నట్టు ఎన్ని రోజులైనా తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు నిరవధిక నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు అనంతరం తాసిల్దార్ శ్రీనివాసులు కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ అంగన్వాడీల డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో వసంత లక్ష్మి. రాములమ్మ అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author