PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముఖ్యమంత్రి జన్మదినం పురస్కరించుకొని యాచకులకు బట్టలు పంపిణీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కడప : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కడప నగరంలోని యాచకులకు అటవీశాఖ డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి, వైఎస్ఆర్సిపి నాయకురాలు చైతన్య లు కడప నగరంలోని యాచకులకు బట్టలు పంపిణీ చేశారు , ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు కులం కానీ మతం గాని పార్టీలతో కానీ సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలు చేపట్టి వారి ఆర్థిక అభ్యున్నతికి తోడ్పాటు ఇవ్వడం జరిగిందన్నారు, ముఖ్యంగా మహిళలకు జగనన్న ప్రభుత్వంలో పెద్ద పీట వేయడం జరిగిందన్నారు, కార్పొరేషన్లలో పదవులు కానీ చట్టసభలలో పెదవులు కానీ మహిళలకు ఇచ్చి వారిని ప్రోత్సహించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారు కొనియాడారు, రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని అలాంటి ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు వారు తెలియజేశారు.

About Author