PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బంగారుపేట యువత..టీడీపీలో చేరిక..!

1 min read

కర్నూలు, పల్లెవెలుగు: క‌ర్నూలు న‌గ‌రంలోని 13వ వార్డు బంగారుపేట ప్రాంతానికి చెందిన యువ‌కులు క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ స‌మ‌క్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ నాయ‌కులు శ్రీనివాస రెడ్డి, సురేష్‌ల ఆధ్వ‌ర్వంలో చ‌ర‌ణ్, భ‌ర‌త్ టీంలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. టి.జి భ‌ర‌త్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ ప్ర‌జా సేవ చేయాలని ఆలోచ‌న ఉన్న‌ త‌న‌తో పాటు మంచి నాయ‌కుడిని ఎన్నుకోవాలనుకుంటున్న‌ ప్ర‌జ‌ల‌కు ఈ 2024 ఎన్నిక‌ల సంవ‌త్సరం ఎంతో కీల‌క‌మైంద‌న్నారు. త‌న‌కు మ‌ద్దతిచ్చి యువ‌కులు ఎంతో మంచి నిర్ణయం తీసుకున్నార‌ని చెప్పారు. క‌ర్నూలు అభివృద్ధి కోస‌మే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్లు చెప్పారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో మాయ‌మాట‌లు చెప్పి ఓట్లు అడిగేవారు ప్ర‌జ‌ల‌కు ఏం సేవ చేశారో చెప్పాల‌న్నారు. త‌న తండ్రి చేసిన అభివృద్ధి గురించి చెబుతూ తాను ప్ర‌జ‌ల వ‌ద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నాన‌ని భ‌ర‌త్ తెలిపారు. ప్రజ‌ల‌కు సేవ చేయాలి, క‌ర్నూలును అభివృద్ధి చేయాల‌న్న ఉద్దేశంతోనే తాను ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. తాను గెలిచిన త‌ర్వాత క‌ర్నూలుకు ప‌రిశ్రమ‌లు తెచ్చి ఉద్యోగావ‌కాశాలు క‌ల్పిస్తాన‌న్నారు.  క‌ర్నూలు జిల్లా మొత్తం అభివృద్ధి చెందేలా తాను ప‌నిచేస్తాన‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌జ‌లంద‌రిలో యువ‌త చైత‌న్యం తీసుకురావాల‌ని కోరారు. పార్టీలో చేరిన వారిలో విన‌య్‌, చ‌ర‌ణ్‌, భ‌ర‌త్‌, జ‌య ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి లీగ‌ల్ సెల్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చంద్ర‌శేఖ‌ర్‌, పురుషోత్తం, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author