PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టి.జి భ‌ర‌త్ ఆధ్వ‌ర్యంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వ‌ర‌రావు  ప్ర‌వ‌చ‌నాలు..

1 min read

టి.జి.బి యూత్‌ సభ్యులు

కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే

పల్లెవలుగు వెబ్ కర్నూలు: క‌ర్నూలు న‌గ‌రంలో ప్ర‌జా నాయ‌కుడు టి.జి భ‌ర‌త్  ఆధ్వ‌ర్యంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వ‌ర‌రావు గారి ప్ర‌వ‌చ‌నాలు అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు టి.జి.బి యూత్ స‌భ్యులు జగదీశ్ గుప్తా తెలిపారు. మంగళవారం ఎస్ ఏ పి క్యాంపులోని టిజి వెంకటేష్ అవుట్ డోర్ స్టేడియం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ ప్ర‌వ‌చ‌నాలు ఈ నెల 10 మ‌రియు 11వ తేదీల‌లో న‌గ‌రంలోని ఎస్‌.ఏ.పీ క్యాంపులోని టి.జి వెంక‌టేష్ అవుట్ డోర్ స్టేడియంలో సాయంత్రం 5.30 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతాయ‌ని చెప్పారు. క‌ర్నూలుతో పాటు చుట్టు ప్ర‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లంద‌రూ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని జ‌యప్ర‌దం చేయాల‌ని వారు కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో పాసులు లేక‌పోయినా పాల్గొన‌వ‌చ్చ‌న్నారు. ప్ర‌జ‌లంద‌రూ ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకొని గురువుగారు చెప్పే దివ్య సందేశం విని తరించవలసిందిగా టిజిబి యూత్ స‌భ్యులు కోరారు.

About Author