PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజల వద్దకే పాలన..

1 min read

పల్లెవెలుగు వెబ్​, వెలుగోడు: ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చి… గ్రామాల అభివృద్ధికి సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. మండలంలో పి.ఎం.జి. ఎస్.వై కింద రూ.4.70 లక్షలతో గుంతకందాల –వేల్పనూరు సీసీ రోడ్డు నిర్మాణానికి గురువారం ఆయన భూమిపూజ చేశారు. అనంతరం శిలాఫలకానికి శంకు స్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నవరత్న పథకాల ద్వారా ప్రజలను లక్షాధికారులను చేస్తున్న ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్ ఆర్ సిపి నాయకులు అంబాల ప్రభాకర్​ రెడ్డి , దేశం తిరిపెం రెడ్డి , సర్పంచ్ అచ్చమ్మ , శివన్న , ఎంపీటీసీ మెంబర్ లాలం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author