NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పుచ్చకాయల మాడ గ్రామంలో బిజెపి ప్రజా పోరు

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ :  బిజెపి చేపట్టిన ప్రజాపోరు యాత్రలో భాగంగా శనివారం పుచ్చకాయాలమాడ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై స్థానిక బిజెపి పత్తికొండ అసెంబ్లీ కన్వీనర్ రంజిత్ కర్ని ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  నేతృత్వంలో గతపదిసంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలను అమలు చేసిన తీరును బిజెపి పత్తికొండ అసెంబ్లీ కన్వీనర్ రంజిత్ కర్ణి ప్రజలకు వివరించారు. అందుకు సంబంధించిన ప్రచార క్యాలెండర్లను పుచ్చకాయల మాడ గ్రామంలో ని బిజెపి క్యాడర్ తో ఆవిష్కరించారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనుసరిస్తున్న  ప్రజా వ్యతిరేక విధానాలను ఈ సందర్భంగా రంజిత్ కర్ణి ఎండగట్టారు. దేశ ప్రజల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ నిరంతరం పడుతున్న తపన ప్రజలు గుర్తించాలన్నారు. ఈ ఎన్నికల్లో బిజెపికి ప్రజలు మద్దతు పలకాలని కోరారు.ఈ కార్యక్రమంలో కరణం నరేష్, బ్రహ్మయ్య మరియు ఇతర బిజెపి నాయకులు పాల్గొన్నారు.

About Author