PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉల్లిగడ్డల లోడ్ .. గుట్కా రవాణా

1 min read

–40 బస్తాల గుట్కాప్యాకెట్లు స్వాధీనం
– వాహనం సీజ్​.. ఇద్దరి అరెస్ట్​
పల్లెవెలుగు వెబ్​, పాణ్యం : కర్నూలు జిల్లా పాణ్యం డొంగు సమీపంలో శుక్రవారం పోలీసు సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీలో 40 బస్తాల గుట్కాప్యాకెట్లు పట్టుకుని, ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు. రాయచూర్​ నుంచి కంభంకు ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం ( Ap31Th5187) డొంగు రస్తాలో తనిఖీ చేయగా ఉల్లిగడ్డల సంచుల మధ్యలో 21 వేల గుట్కా ప్యాకెట్లు గుర్తించారు. వాటి విలువ రూ. దాదాపు 3లక్షల15వేలు ఉంటుందన్నారు. వాహనాన్ని సీజ్​ చేసి, ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. ముద్దాయిలు మేడం శ్రీనివాస్​ (గుంటూరు జిల్లా వినుకొండ), షేక్​ నాయర్​ ( ప్రకాశం జిల్లా కంభం)ను విచారించగా వెంకటరామాంజనేయులు, రాజశేఖర్​ రెడ్డి అనే వ్యక్తులు చెబితే నిషేధిత పదార్థాలను తరలించినట్లు తెలిపారు. సమావేశంలో సీఐ జీవన్​ గంగనాథ్​ బాబు, ఎస్​ఐ సుధాకర్​ రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

About Author