PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోడుమూరులో వైసీపీకి షాక్…

1 min read

టిడిపిలోకి చేరిన రేమట గ్రామ వైసీపీ కార్యకర్తలు

పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన కోడుమూరు సీనియర్ టిడిపి నాయకుడు విష్ణు వర్ధన్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా కోడుమూరులో వైసీపీ పార్టీకి షాక్ తగిలింది.. రేమట గ్రామంలోని బోయ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు.. వీరికి కోడుమూరు సీనియర్ టిడిపి నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి, కర్నూలు పార్లమెంట్ టిడిపి అభ్యర్ధి బస్తిపాటి నాగరాజు లు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.. ఈ సందర్బంగా ఎం.పి అభ్యర్థి నాగరాజు మాట్లాడుతూ తెలుగు దేశం ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని గ్రహించి వైసిపి పార్టీ వారు టిడిపిలోకి రావడం హర్షించదగ విషయమన్నారు.. గత ఎన్నికల్లో జగన్ విజయం కోసం  తల్లి, చెల్లి ప్రచారాలు చేశారని,  అయితే ఈ ఎన్నికల్లో తన అన్న కు ఓటు వెయ్యొద్దని ప్రచారం చేస్తుండటం జగన్ అరాచక పాలనకు నిదర్శనమన్నారు.. సొంత కుటుంబాన్ని పరిపాలించలేని వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు..ఇక జగన్ పాలనలో రైతులకు సాగు నీరు ఇవ్వలేదన్న నాగరాజు.. పథకాలు, నవరత్నాల పేరు తో  బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోపిడీ చేసాడని మండిపడ్డారు.. ఈ కార్యక్రమంలో రేమట గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author