అంగరంగ వైభవంగా కోసిగి శ్రీ రేణుకా యల్లమ్మ అవ్వ మహా రధోత్సవం
1 min read
వివిధ రాష్ట్రాల నుండి భారీగా తరలి వచ్చిన భక్తులు
ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి
ఘన స్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు
పల్లెవెలుగు ,మంత్రాలయం: మంత్రాలయం నియోజకవర్గం కోసిగి టౌన్ లో వెలసిన శ్రీ రేణుకా యల్లమ్మ అవ్వ మహా రధోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయం పూజారులు, పెద్దలు అధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి గ, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. వారికి కోసిగి టౌన్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున బాణాసంచా కాల్చి,డ్రమ్స్ తో పూల వర్షం తో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం శ్రీ యల్లమ్మ అవ్వ దేవాలయం పూజారులు, పెద్దలు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదం అందజేసి శాలువా పూలమాలతో సన్మానించి ఆశీర్వదించారు అనంతరం మహా రధోత్సవం లో పాల్గోని రధోత్సవం లాగి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగు వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరత్వాజ్ శేట్టి, తెలుగు యువత రవితేజ శేట్టి, జిల్లా కార్యనిర్వహణాధికారి కోట్రేష్ గౌడ్, బిసి సెల్ నియోజకవర్గం అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి, యువ నాయకులు మాధవరం క్రిష్ణా మోహన్ రెడ్డి, కౌతాళం టౌన్ అధ్యక్షులు కాశీ విశ్వనాథ్ ధని,పెద్ద కడుబూరు ఇంద్రసేనారెడ్డి, నీలకంఠ రెడ్డి,తెలుగు యువత మండల అధ్యక్షులు నాడిగేని మహాదేవ, సీనియర్ నాయకులు కోండగేని వీరారెడ్డి,కోసిగి టౌన్ అధ్యక్షులు పంపాపతి, నాడిగేని వీరారెడ్డి, నాడిగేని నర్సారెడ్డి, వడ్డే రామయ్య, డీలర్ నరసన్న, యస్ సి సెల్ నాయకులు మారేప్ప, శిను, చిన్న భూంపల్లి నరసింహులు, జంపాపురం క్రిష్ణా రెడ్డి, నరసింహరెడ్డి,పల్లేపాడు చంద్ర, చింతకుంట అంపయ్య,సాతునూరు ఉలిగయ్య, ముగలదోడ్డి శీను, ఆర్లబండ రామాంజనేయులు, తుంబిగనూరు భీమయ్య,బెళగల్ ప్రభాకర్ రెడ్డి, ఈడిగ భీమయ్య గౌడ్, రామయ్య, రాజశేఖర్ రెడ్డి,ఉసేని, బసవలింగప్ప, ఈడిగ నాగరాజు,జుమ్మలదిన్ని రాగయ్య,ఐ టిడిపి టీమ్ భూంపల్లి నీలకంఠ, దుద్ది నాగేష్, పర్సాని హనుమంతు, అగసునూరు అంజినిరెడ్డి, దాదా ఉసేని, పెద్ద భూంపల్లి రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.