ప్రతి ఏట మార్చి 4వ తేదీ “లైన్ మెన్ దివాస్” దినోత్సవం
1 min read
దేశాన్ని ఉజ్వల భవిష్యత్తును శక్తివంతం చేయడంలో లైన్ మెన్ అమూల్యమైన పాత్ర వహిస్తాడు
పి.సాల్మన్ రాజు, పర్యవేక్షక ఇంజనీర్
ఘనంగా ఏలూరు సర్కిల్ నందు కార్యక్రమం
పెద్దఎత్తునపాల్గొన్న ఏపీ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థఉద్యోగులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : విద్యుత్ రంగంలోని ఫ్రంట్లైన్ కార్మికులు లైన్ మెన్ లని, వారి సంక్షేమం కోసం ప్రతీ ఏటా మార్చి ,4వ తేదీన “లైన్ మెన్ దివస్” కార్యక్రమంగా నిర్వహిస్తామని పర్యవేక్షక ఇంజనీర్ పి.సాల్మన్ రాజు చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణి సంస్థ, ఏలూరు సర్కిల్ నందు “లైన్ మెన్ దివస్” కార్యక్రమమును పర్యవేక్షక ఇంజనీర్ పి.సాల్మన్ రాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగినది. తదుపరి పర్యవేక్షక ఇంజనీర్ పి.సాల్మన్ రాజు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం మార్చి 4వ తేదీన దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీకి వెన్నెముకగా నిలిచే లైన్మెన్ మరియు గ్రౌండ్ మెయింటెనెన్స్ సిబ్బంది యొక్క అవిశ్రాంత అంకితభావం మరియు సేవలను గుర్తించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని, దేశాన్ని ఉజ్వల భవిష్యత్తును శక్తివంతం చేయడంలో లైన్మన్ దివస్ వారి అమూల్యమైన పాత్రకు నిదర్శనమని అన్నారు. విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించడం, విద్యుత్ లైన్ల మరమ్మత్తు మరియు నిర్వహణ, డిస్కనెక్ట్ చేయబడిన వైర్లు, విద్యుత్ వైఫల్యాలు, విద్యుత్తు అంతరాయం ఏర్పడినప్పుడు, విద్యుత్తును పునరుద్ధరించడానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో సైతం లైన్మెన్ లు అవిశ్రాంతంగా పని చేస్తారు. విద్యుత్ రంగంలోని ఫ్రంట్లైన్ కార్మికులకు ఈ కార్యక్రమం గొప్ప మనోధైర్యాన్ని పెంచుతుందని తెలియజేశారు. మన దేశ విద్యుత్ మౌలిక సదుపాయాలు సజావుగా పనిచేయడానికి అవిశ్రాంతంగా పనిచేసే ఈ ఫ్రంట్లైన్ హీరోల అంకితభావం మరియు వారి సేవ పట్ల అచంచలమైన నిబద్ధత భారతదేశం యొక్క ఉజ్వల భవిష్యత్తు వైపు ప్రయాణాన్ని శక్తివంతం చేయడంలో వారి అమూల్యమైన పాత్రకు లైన్మన్ దివస్ నిదర్శనంగా మారుతుందని తెలియ చేసినారు. విద్యుత్ పంపిణీకి వారి అమూల్యమైన కృషికి, అత్యుత్తమ ప్రతిభా పాటవాలను మరియు సేవలను ప్రదర్శించిన ఏలూరు జిల్లాకు చెందిన 14మంది లైన్ మెన్ లను ఎంపిక చేసి వారిని తగిన విధంగా సత్కరించడం జరిగినది. ఈ కార్యక్రమమునకు ఏలూరు ఈ.ఈ.ఆపరేషన్, కె.ఎం. అంబేద్కర్, ఈ.ఈ.ఆపరేషన్, జంగారెడ్డిగూడెం పి.అహ్మద్ ఖాన్, ఈఈ టెక్నికల్ పి.రాధాకృష్ణ, ఈఈ కన్స్ట్రక్షన్ టి.శశిధర్,ఈఈ ఎం.ఆర్.టి. కె.శ్రీనివాసరావు, మరియు ఇతర విద్యుత్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.