“శ్రీ కాశినాయన జ్యోతి క్షేత్రం” ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే
1 min read
కడప, న్యూస్ నేడు: శానివారం కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కాశీనయన మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ” శ్రీ అవధూత కాశీనాయన జ్యోతి క్షేత్రం ను సందర్శించి దర్శించుకున్నారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ రాయలసీమలో ప్రఖ్యాతిగాంచిన అవధూత కాశినయన ఆశ్రమంలో కొన్ని షెడ్లలను అటవీ అధికారుల కూల్చివేత దారుణమని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రిన్సిపాల్ సెక్రటరీ మధు సుధన్ రెడ్డికి కాశీ రెడ్డి నాయన ఫైల్ ను పూర్తి చేయమని చెప్పడం జరిగింది.. ఈ టెంపుల్ పూర్తి కావడానికి ఈ చుట్టూ పక్కల ఉన్న గ్రామాల ప్రజలు మరియు భక్తులు అందరు కలిసి కాశీ రెడ్డి నాయన ఆశ్రమానికి తమవంతుగా కృషి చేస్తే మావంతుగా మేము కూడా కృషి చేస్తామని కోరిన నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి .

