PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ట్రిపుల్ ఐటీ కి మోడల్ పాఠశాల విద్యార్థులు ఎంపిక

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలోని మోడల్ పాఠశాల విద్యార్థులు కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కళాశాలకు నలుగురు విద్యార్థులు ఎంపిక అయినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ సలీం భాష తెలిపారు.పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా 2023-24 విద్యా సంవత్సరానికి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ కళాశాలకు బట్టల శ్రావ్యశ్రీ నందికొట్కూరు, మిడుతూరు దూదేకుల సోనీ, సి భరత్ జలకనూరు,వడ్డే మానస వీరు అర్హత సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా మిడుతూరు జిల్లా పరిషత్ పాఠశాల నుంచి-1, కడుమూరు జడ్పీహెచ్ఎస్ నుంచి ఇద్దరు త్రిబుల్ ఐటీ కళాశాలకు ఎంపిక అయ్యారు. వీరిని పాఠశాలల ఉపాధ్యాయులు అభినందించారు.

About Author