NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిఎఎస్ ఎఫ్  ఉత్పాదనలు వాలెక్సియో మిబెల్యా విడుదల

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  బిఎఎస్ ఎఫ్ ఇండియా తన ఆధునిక విశ్వ పంట రక్షణ పరిష్కారాల్లో రెండు రకాలు అయిన వాలెక్సీయో కీటకనాకనిని మరియు మిబెల్యా శిలీంద్రనాశినిని విడుదల చేశారు., భారతదేశంలో అత్యంత ముఖ్య ఆహార పంట అయిన వరి పంటకు ఇవి సేవలందిస్తాయి. ఈ రెండు వినూత్న పరిష్కారాలను ప్రవేశపెట్టడం భారతదేశపు జాతీయ ఆహార భద్రత ఎజెండాకు సహాయపడుతుంది. వరి పంటకు తీవ్ర నష్టం కలిగించే కీటకాలైన దోమ పోటును అదుపుచేయడం మరియు పొడ తెగులు లాంటి తెగుళ్ళను నియంత్రించడం ద్వారా వరి రైతులు తమ పంట దిగుబడులను పెంచుకోవడానికి ఈ పరిష్కారాలు సహాయపడతాయని తెలిపారు.వార్షిక పంట ఉత్పత్తి 100 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా ఉండటంతో, ప్రపంచంలో వరి పండించే దేశాల్లో భారతదేశం రెండవ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా వరి ట్రేడ్ లో 40 శాతానికి దోహదపడుతోంది. వాతావరణ మార్పు ప్రభావం భారతదేశంలో వరి రైతులను బాగా ప్రభావితం చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కరవు, తెగుళ్ళు, దోమ పోటు విస్తరణ వల్ల దిగుబడులు అల్పంగా మరియు నాణ్యత తక్కువగా ఉంటాయని మార్కో గ్రోజ్ దనోవిక్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ అండ్ సస్టెయినబిలిటి, బిఎఎస్ ఎఫ్ అగ్రికల్చరల్ సొల్యూషన్స్ అన్నారు.సైమన్ బర్గ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బిఎఎస్ ఎఫ్. అగ్రికల్చరల్ సొల్యూషన్స్ ఆసియా-పసిఫిక్  మాట్లాడుతూ ‘వాలెక్సియా అనేది బిఎఎస్ ఎఫ్ యొక్క ఆధునిక కీటకనాశిని ఆసియా పసిఫిక్ లోని వరి రైతులకు మాత్రమే కాకుండా, ఈ ప్రాంతంలోని వరిపంట వ్యవస్థకు మా చీర్ఘకాలిక నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తోంది, మేము దీనిని మొట్టమొదటగా భారతదేశంలో ప్రారంభిస్తున్నందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాము వరి రైతులకు వాళ్ళ పొలాల్లో కీటకాలను అదుపు చేసేందుకు సహాయపడే కొత్త కెమిస్ట్రీ అవసరమనే విషయం మేము తెలుసుకున్నాము. కాబట్టి మొట్టమొదటగా భారతదేశంలో ప్రారంభించాము’ అన్నారు  . ”క్రియాశీల పదార్థంలో మార్కెట్ ప్రమాణాలకు తెలిసిన క్రాస్ రెసిస్టెన్స్ లేదు నాలుగు రకాల వరి దోమ పోట్ల యొక్క జీవిత దశలన్నిటిపై అద్భుతమైన పనితీరు చూపిస్తుంది మరియు అవశేషాలను సుదీర్ఘ కాలంనియంత్రిస్తుందన్నారు.మొక్కకు సర్వోత్తమ ఆరోగ్య ప్రయోజనాలు కల్పించడం ద్వారా వరి మొక్కలను వాలెక్సియో బలపరుస్తుందని కూడా నిర్వహించబడిన అధ్యయనాలు ప్రదర్శించాయి వాలెక్సియోనితో శుద్ధి చేసిన వరి ప్లాట్ లు బలమైన కాండాన్ని దట్టమైన గుబురు, అధిక వేరు వ్యవస్థ మరియు వెడల్పాటి జెండా ఆకులను చూపించాయని దీనివల్ల ఎక్కువ మొక్కలు రక్షించబడి రైతులకు అధిక దిగుబడులు అందిస్తాయని తెలిపారు.వర్షాకాలం సమీపిస్తుండటంతో, వరి రైతులకు అధిక సెలెక్టివిటీ మరియు అధిక ప్రభావంతో పంటలో తెగుళ్ళను అదుపు చేసే ఆధునిక కెమిస్ట్రీ కూడా అవసరమవుతోంది, బిఎఎస్ ఎఫ్ వారి ఆధునిక శిలీంద్రనాశిని క్రియాశీల పదార్థ రెవిసోల్ తో మరియు దాని యొక్క ఇతర పేటెంటెడ్ క్రియాశీల పదార్థం జేమియం”తో మిబెల్యా శక్తివంతమైంది. వరి రైతులకు ఇప్పుడు ద్వివిధ కార్యాచరణ గల ఆధునిక కెమిస్ట్రీ ఉంది, అది వేగంగా చర్య చూపిస్తుంది, లోతుగా రక్షిస్తుంది మరియు వరిలో పొడ తెగులును మరియుముడికి కంకులను సుదీర్ఘ కాలం పాటు నియంత్రిస్తుందని ఆయన తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *