NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాటుసార స్థావరాలు పై దాడులు..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: నవోదయం కార్యక్రమంలో భాగంగా నాటుసార స్థావరాలు పై దాడులు నిర్వహించడం జరిగింది బంగారు పేటలో నాటు సారా తయారీకి ఉపయోగించు బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగింది. సుమారు 11 వందల లీటర్ల బెల్లం ఊట మరియు 110 లీటర్ల నాటుసారా ను ధ్వంసం చేయడమైనది. తదుపరి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయడం జరిగింది వారి వద్ద నుంచి సుమారు 60 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకోవడం జరిగింది . వారి వివరములు చాకలి రాధా నీలి షికారి రుక్మిణి నీలి షికారి సుగుణ లను అరెస్టు చేసి రిమాండ్కు పంపించడమైనది. అనంతరం గుడుంబాయి తండా మరియు గుమితం తండాలలో నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించి సుమారు 1100 లీ. నాటు సారాకు ఉపయోగించే బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగింది. మొత్తం 2200 లీటర్ల నాటసారా కు ఉపయోగపడు బెల్లం ఊట మరియు 110 లీటర్ల నాటు సారా ను ధ్వంసం చేయడం జరిగినది ఈ దాడులలో ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ ఎస్సైలు మధుసూదన్ ఇంద్రకిరణ్ తేజ మరియు సిబ్బంది ఈరన్న రాజు మధు సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *