ఇంటివద్దకే రేషన్ పేరుతో రూ 1600 కోట్ల దోపిడీ
1 min read
రేషన్ పంపిణీ పై ఒక నిఘా వ్యవస్థను ఏర్పాటు
ప్రజలకు సక్రమంగా బియ్యం పంపిణీ చేయాలి
పేద ప్రజలకు అందించే బియ్యం పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవు
మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి
మంత్రాలయం న్యూస్ నేడు: వైకాపా ప్రభుత్వం గత ఐదేళ్ల లో ఇంటి వద్ద కే రేషన్ పేరు తో రూ 16 వందల కోట్లు రూపాయలు దోపిడీ చేసిందని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి విమర్శించారు. మండల పరిధిలోని సుంకేశ్వరి గ్రామంలో షాప్ నెం :-20 ను కూటమి జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న, బిజెపి ఇన్చార్జ్ మాధవరం విష్ణు వర్ధన్ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్లి డీలర్లు రేషన్ అందించడం జరుగుతుందని తెలిపారు. గత ఐదేళ్లలో ఇంటివద్దకే రేషన్ అంటూ రూ 1600 కోట్ల దోపిడీకి తెర లేపారని విమర్శించారు. ఎక్కడా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేసిన దాఖలాలు లేవని అన్నారు. రేషన్ బియ్యం అందక ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయని తెలిపారు. ప్రజల ఇబ్బందులు గుర్తుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత విధానాన్ని మళ్లీ తీసుకొచ్చారని తెలిపారు. నెలలో 15 రోజులపాటు 2 పూటలా రేషన్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరికీ తెలియని సమయంలో ఆ వాహనాలు వచ్చి వెళ్లేవి..దీని ద్వారా ప్రతినెల రేషన్ తీసుకోకుండా సామాన్యులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఈ వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టేందుకు ఇకపై రేషన్ దుకాణాల ద్వారానే రేషన్ సరుకులు అందిస్తామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా రేషన్ సక్రమంగా అందించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా రేషన్ ఇవ్వకుండా పదేపదే తిప్పుకున్నా, తూకాల్లో మోసాలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ప్రజలు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. టిడిపి ప్రభుత్వంలో అక్రమాలకు, అవినీతికి తావులేదంటూ తెలిపారు. అనంతరం కూటమి ఇన్చార్జ్ లను స్థానిక నాయకులు గజ మాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవి, వీఆర్వో ఆనంద్, టిడిపి జిల్లా అధికార ప్రతినిధి మాలపల్లి చావిడి వెంకటేష్, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, సాగునీటి సంఘం ఛైర్మెన్ చంద్ర టిడిపి నాయకులు రోగప్ప, రామలింప్ప, రంగడు, భీరప్ప, లక్ష్మి రెడ్డి, రంగస్వామి, వీరారెడ్డి, ఛైర్మెన్ అయ్యప్ప, భీరప్ప, లక్ష్మన్న, దబ్బాల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
