NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉగ్రవాదం నశించాలి ..దేశ సమైక్యతను కాపాడుకోవాలి ..

1 min read

మంత్రాలయం న్యూస్​ నేడు:  ఉగ్రవాదం నశించాలి దేశసమైక్యతను కాపాడుకోవాలని స సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం మంత్రాలయం లో సమైక్య శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం నుండి  రాఘవేంద్ర సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్ లో గంటపాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఈ సందర్భంగా  మంత్రాలయం సిపిఐ తాలూకా నాయకులు భాస్కర్ యాదవ్ పెద్దకడబూరు మంత్రాలయం సిపిఎం నాయకులు ఈ తిక్కన. హెచ్ జయరాజు లు మాట్లాడుతూ  పహాల్గం ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించాలని దేశ సమైక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరిపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ ది అని  అన్నారు. దేశంలో మతోన్మాదులు ఎక్కువై ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు చేస్తున్న కూడా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమైన విషయం అన్నారు. దేశ సమగ్రత కోసం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా వామపక్ష ఎర్రజెండా పార్టీలు పోరాడుతూ ఉంటాయన్నారు. అలాగే దేశం కోసం పోరాడుతున్న సైనికులకు దేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వం వామపక్ష పార్టీలు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  సిపిఐ నాయకులు లక్ష్మన్న నాయక్, గాబ్రియేలు, ఏఐవైఎఫ్ రాజు, సిపిఎం నాయకులు శ్రీనివాసులు, బి అనిల్, ప్రాణేష్, ఆంద్రయ, వీరేష్, డివైఎఫ్ఐ నాయకులు సద్దాం తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *