NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా బక్రీద్​ పండుగ…

1 min read

న్యూస్ నేడు హొళగుంద: త్యాగానికి  బక్రీద్ పండుగ హోళగుంద లో శనివారం అహలె హదీస్ పెద్ద మసీదు నుండి 7. 15 నిమిషాలకు ముస్లిం మత పెద్దలు, ఆయా మసీదుల ముతవల్లీలు, మౌల్ వీలు, ఇమామ్ మరియు మౌజనులు, ముస్లిం సోదరులు, బాల బాలికలు, మహిళలు అల్లాను ప్రార్థిస్తూ పురవీధుల్లో ఊరేగింపుగా ఈదుగాకు చేరుకున్నారు. ఈద్గాలో ముస్లిం సోదరులకు మౌల్వి హబీబుల్లా జా మై నమాజ్ చేశారు. అలాగే ఆహా లే సున్నతులు జమాత్, రాజా నగర్ లోని దూదేకుల అహలేసున్నతుల్ జమాత్ ఆధ్వర్యంలో ఆయా మసీదుల నుండి అల్లాను ప్రార్థిస్తూ విధిగా చేరుకొని ముస్లిం సోదరులు సామూహిక ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలను ఉద్దేశించి మౌలి వి సమీయుల్లా జామ యి ఉపన్యాసిస్తూ దైవ ప్రవక్త ఇబ్రహీం తన కుమారుడి ఇస్మాయిల్ను అల్లా పేరుట బలిదానం చేయడానికి సిద్ధం కాగా అందుకు అల్లా ఇబ్రహీం భక్తిని ఎంతగానో స్వర్గం నుండి మేకను దింపి బలి ఇవ్వగా అదే త్యాగ బలిదానానికి బక్రీద్ పండుగ అని అన్నారు. ముస్లిం సోదరులు అందరూ దేశ సమగ్రతకు కట్టుబడి ఉండాలని, దేశ అభివృద్ధికి కృషి చేయాలని శాంతి సోమరస్యంతో మెలగాలని ఉద్బోధించారు. దైవప్రవక్త ఇబ్రహీం 5000 సంవత్సరాల క్రితం చేపట్టిన త్యాగ బలి దానాన్ని స్మరిస్తూ అహంభావాన్ని విడనాడాలని బలహీనులకు మద్దతుగా నిలువాలని కోరారు. పేద ప్రజల పట్ల ఆదరణ, దయ, జాలి చూపుతూ వారికి అన్ని విధాల సహాయం అందించాలని అప్పుడే మానవ సంబంధాలు మెరుగుపడతాయని అన్నారు. తల్లిదండ్రుల పట్ల కుటుంబ సభ్యులు విధేయులుగా ఉండాలని మహిళను గౌరవించాలని పిల్లల పట్ల ప్రేమ అనురాగంతో చూడాలని వృద్ధులను ఎల్లవేళలా గౌరవించి తగిన  మర్యాదలతో చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముస్లిం సోదరులు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జంతుబలి దానాలు ఇవ్వాలని అందరినీ ప్రేమించాలని కోరారు. దైవ ప్రవక్త ఇబ్ర హీం, ఇస్మాయిల్, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో నడవాలని కురాన్ బోధనలకు అనుగుణంగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. మద్యపానం, మట్కా ,గుట్కా, వ్యభిచారం, జూదం వంటి దుచ్చటాలకు దూరంగా ఉండి కుటుంబాలను మంచిగా చూసుకోవాలని కోరారు. ప్రపంచ శాంతి కోసం, వర్షం సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు కళకళలాడాలని, ప్రపంచ, దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సామరస్యంతో, కరోనా వ్యాధికి బలికాకుండా చూడాలంటూ అల్లాను ప్రార్థించారు. బక్రీద్ పండుగ సందర్భంగా బంధుమిత్రులకు, ప్రజలకు, ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. రంగురంగులతో మసీదులను అలంకరించారు. పండుగలు ఎలాంటి సంఘటన జరగకుండా సీఐ, ఎస్సై దిలీప్ కుమార్, శ్రీనివాస్, చంద్ర భారీ పోలీసులు నిర్వహించారు. బక్రీద్ పండుగ ప్రశాంతంగా జరిగింది. ఈదుగా ప్రార్థనలో మౌలివిలు కె హబీబుల్లా, టి సమీయుల్ల,k జూబే ర్, ఎం కిఫాయుతుల్ల, ఫాతీర్, బి సైఫుల్ల, బి, అయుబ్ సమీవుల్లా, టి ప్పు, మాజ్, ముత వల్లీలు, ముస్లిం మత పెద్దలు, మహిళలు సామూహిక ప్రార్థనలో భారీ సంఖ్యల పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *