NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిరాధారమైన ఆరోపణలు వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు

1 min read

జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి

జర్నలిజంలో ప్రాథమిక సూత్రమైన,స్పష్టమైన నిర్ధారించబడిన వ్యక్తుల నుండి ప్రసారం చేసే సమయంలో వివరణ తీసుకోవాల్సి ఉంటుంది.

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : ప్రభుత్వ అధికారుల విశ్వసనీయతను  దెబ్బతీసే విధంగా ధృవీకరించని, నిరాధారమైన ఆరోపణలను వ్యాప్తి చేసే  వారిపై   చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు.  నిరాధారమైన ఆరోపణలను వ్యాప్తి చేసే వ్యక్తులుగాని, మీడియా ప్రతినిధులు, ఇతర సమూహాలు ఎవరైనా గాని చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసివస్తుందన్నారు.    ఒక వార్తను గాని, విషయాన్నీ గాని ప్రసారం చేసే సమయంలో జర్నలిజంలో  ప్రాధమిక సూత్రమైన  స్పష్టమైన, నిర్ధారించబడిన, ధృవీకరించబడిన సమాచారాన్ని ముందుగా కలిగి ఉండాలని,అటువంటి సమాచారాన్ని ప్రసారం చేసే,  వ్యాప్తి చేసే సమయంలో  సంబంధిత వ్యక్తులు, వ్యవస్థల నుండి వివరణ తీసుకోవలసి ఉంటుందన్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే రీతిలో ఆధారం లేని సమాచారంతో నిరాధారమైన వార్తలను, విషయాలను ప్రసారం, వ్యాప్తి చేయడం  మూలంగా ప్రజా, వృత్తిపరమైన వర్గాలలో వారి ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని, దీని కారణంగా వారు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కుంటారన్నారు.    ఎవరిదైనా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించడంలో భాగంగా ఎవరైనా ధృవీకరణ కాని,  నిరాధారమైన ఆరోపణలు ప్రసారం చేయడం, వ్యాప్తి చేయడం  చేస్తే  అటువంటి వారిపై  చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి హెచ్చరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *