PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముచ్చటగా ముగ్గురితో..

1 min read

సినిమా డెస్క్​: తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ని క్రియేట్‌ చేసుకున్న వారిలో కోలీవుడ్‌ స్టార్‌‌ హీరో ధనుష్ ఒకరు. హాలీవుడ్, బాలీవుడ్‌, కోలీవుడ్‌ అని తేడా లేకుండా అన్నింటా తన మార్క్‌ వేశాడు ధనుష్. డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకీ దగ్గరైన ధనుష్ ఇప్పటి వరకూ తెలుగులో స్ట్రెయిట్‌ మూవీ చెయ్యలేదు. కానీ రీసెంట్‌ శేఖర్‌‌ కమ్ముల దర్శకత్వంలో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. క్రియేటివ్‌ డైరెక్టర్‌‌కి ఈ క్రేజీ హీరో తోడైతే ఎలా ఉంటుందోనని అటు తమిళ ఫ్యాన్స్, ఇటు తెలుగు అభిమానులు ఉత్సాహపడుతున్నారు. అయితే ఈ సినిమాకంటే ముందు కమిటైన తమిళ చిత్రాలు ఫినిష్ చేయాల్సి ఉంది ధనుష్. శేఖర్‌‌ కమ్ముల చైతు, సాయి పల్లవితో ‘లవ్‌ స్టోరి’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా రిలీజ్‌ ఆగింది. ఈ ఆగస్ట్‌లో రిలీజ్‌ ఉంటుందని అంటున్నారు. దీంతో శేఖర్ సినిమా సెట్స్‌కి వెళ్లేందుకు ఇంకొంచెం టైమ్‌ పట్టేలా ఉంది. శేఖర్‌‌ కమ్ముల తియ్యబోయే సినిమా భారతీయ విద్యా వ్యవస్థలో ఉండే లోటుపాట్లను ఎత్తిచూపేలా ఉండబోతోందనే గ్యాసిప్స్‌ వినిపిస్తున్నాయి. హీరోయిన్‌గా పూజాహెగ్డే కన్ఫామ్‌ అంటున్నారు. ప్రస్తుతం ధనుష్ కార్తీక్ నరేన్ డైరెక్షన్‌లో నటిస్తున్నాడు. హైదరాబాద్‌లో మూవీ షూటింగ్ జరుగుతోంది. వచ్చే వారం మిత్రన్ జవహర్ దర్శకత్వంలో ధనుష్ నలభై నాలుగవ చిత్రం షూటింగ్ స్టార్ట్ అవబోతోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారట. కెరీర్ లో ఇప్పటివరకూ ధనుష్ ఇద్దరు హీరోయిన్స్‌తో మాత్రమే నటించాడు. ముగ్గురితో కలిసి నటించడం ఇదే ఫస్ట్ టైమ్. ఆ ముగ్గురు ఎవరనే విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే ధనుష్ ఈ ఏడాది తమిళ సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసి, వచ్చే యేడు తన ఫోకస్‌ మొత్తం టాలీవుడ్‌పై పెట్టే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

About Author