క్రీడలు సంపూర్ణ మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి
1 min read
వాలీబాల్ సమ్మర్ క్యాంపు ను సందర్శించిన ఆర్డీవో భరత్ నాయక్.
పత్తికొండ, న్యూస్ నేడు: క్రీడలు క్రీడాకారుల మానసిక ఉల్లాసాన్ని అలాగే శారీరక సామర్ధ్యాన్ని పెంపొందిస్తాయని ఆర్డీవో భరత్ నాయక్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గత 25 రోజులుగా జరుగుతున్న బాలికల వాలీబాల్ సమ్మర్ క్యాంపును ఆయన సందర్శించారు. క్రీడాకారులు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలన్నారు. ముఖ్యంగా బాలికలు క్రీడల పట్ల అవగాహన కలిగి ఉండి క్రీడల్లో విరివిగా పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా వాలీబాల్ క్రీడాకారులను ఆర్డిఓ పలకరించి వారిని ఉత్సాహపరిచారు. వాలీబాల్ కోచ్ ఇస్ పెంటి రామాంజనేయులు, ఇతర ఫిజికల్ డైరెక్టర్లు ఈ బాలికల వాలీబాల్ సమ్మర్ క్యాంపులో పాల్గొన్నారు.
