విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయండి…
1 min read
న్యూస్ నేడు ఆలూరు : ముఖ్యమంత్రి .నారా చంద్రబాబు నాయుడు అకుంఠిత దీక్షా పట్టుదలతో ఆయన ఆధ్వర్యంలో అలాగే యువనేత శ్రీ.నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర ద్వారా మనరాష్ట్ర ప్రజల ఆశీస్సులతో టిడిపి కూటమి ప్రభుత్వ టిడిపి +జనసేన+బిజెపి)అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా. గురువారం ఉదయం 10.00 గంటలకు మన ఆలూరు తాలూకా ముద్దుబిడ్డ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రజాభి మాననేత నియోజకవర్గ టిడిపి ఇంచార్జి .బి.వీరభధ్రగౌడ్ ఆధ్వర్యంలో ఆలూరు పట్టణంలో భారీఎత్తున విజయోత్సవ ర్యాలీ కార్యక్రమం జరుగును ఈకార్యక్రమంలోఆలూరు నియోజకవర్గ ఆరు మండలాల కూటమి ప్రభుత్వ నేతలు కార్యకర్తలు టిడిపి కన్వీనర్లు,క్లస్టర్,బూత్,యూనిట్ టిడిపి ఇన్చార్జులు టిడిపి సర్పంచ్ లు ఎంపీటీసీలు జడ్పిటిసిలు లు ఎంపీపీలు,వివిధ హోదాలలో ఉన్న రాష్ట్ర,జిల్లా మరియుతాలూకా స్థాయి వివిధ హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు,కార్యకర్తలు అలాగే తెలుగుయువత, ఐటిడిపి, టిఎన్ఎస్ఎఫ్, టిఎన్టియుసి, టిడిపి, శోషల్ మీడియా,మహిళా సంఘాలు అలాగే టిడిపి అనుబంధ సంఘాల పసుపు సైనికులు, కార్యకర్తలు అందరూ భారీ సంఖ్యలో పాల్గొని ఈకార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
