విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
1 min read
కిట్లను పంపిణీ చేసిన సురేంద్ర నాథ్ రెడ్డి..
నందికొట్కూరు, న్యూస్ నేడు : విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని అల్లూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టడీ మెటీరియల్ కిట్లను పంపిణీ చేశారు.విద్యార్థులకు పాఠశాల యూనిఫామ్ దుస్తులు, బ్యాగులు,టెక్స్ట్ మరియు లాంగ్ నోట్ బుక్స్ లను గ్రామ సర్పంచు చిన్న నాగ లక్ష్మయ్య, పాఠశాల చైర్మన్ మౌలాలి, ప్రధానోపాధ్యాయులతో కలిసి ఆయన పంపిణీ చేశారు.అదే విధంగా నందికొట్కూరు పట్టణంలోని వడ్డేపేటలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు టిడిపి నాయకులు క్లస్టర్ ఇంచార్జి ముర్తు జావలి స్టడీ మెటీరియల్ కిట్లను అందజేశారు.ఉపాధ్యాయులు చెప్పిన విధంగా మంచిగా చదువుకొని పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో లింగారెడ్డి, కురువ వెంకటేశ్వర్లు, సున్నంపల్లి శ్రీనివాసులు, నాగార్జున, రవి, రామలింగం, విద్యార్థులు పాల్గొన్నారు.
