టీచర్ గా మారిన నంద్యాల కలెక్టర్..
1 min read
సబ్జెక్టు పరంగా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలి: కలెక్టర్
మిడుతూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజ కుమారి ఉపాధ్యాయురాలిగా అయ్యారు.తరగతి గదిలో ఉన్న బోర్డుపై రాస్తూ విద్యార్థులకు పలు ప్రశ్నలు వేస్తూ వాటి గురించి కలెక్టర్ విద్యార్థులను అడిగారు. మంగళవారం మధ్యాహ్నం నంద్యాల జిల్లా పాణ్యం మోడల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాలలో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించి విద్యార్థులతో కలిసి కలెక్టర్ భోజనం చేశారు.బాలికలకు కలెక్టర్ భోజనాన్ని తినిపించారు.భోజనం నాణ్యతగా పరిశుభ్రంగా మెనూ పకారం విద్యార్థులకు తప్పనిసరిగా అందించాలని ఉపాధ్యాయులకు మరియు వంట నిర్వాహకులకు కలెక్టర్ సూచించారు.అనంతరం పాఠశాల ఆవరనము చుట్టూ కాంపౌండ్ వాల్, రోడ్డు,తక్షణమే వేసెలా చూస్తామని కలెక్టర్ అన్నారు. పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నారా అని విద్యార్థులను ప్రశ్నించారు.లేదా అని పరిశీలించారు. ఏమైనా మీకు అనుమానాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని అంతే కాకుండా మంచిగా చదువుకొని మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. పదవ తరగతి అయిపోయాక జీ,మెయిన్స్,ఎంసెట్ లో ఉత్తీర్ణత కనబరిచే విధంగా చదవాలని అన్నారు.విద్యార్థులు క్రమశిక్షణతో నడచుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంఈఓ కోటయ్య,ప్రిన్సిపాల్ దినేష్ బాబు,పాఠశాల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.
