జీఎస్టీ సజావుగా చెల్లించేలా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి
1 min read
జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు : చట్ట ప్రకారం జీఎస్టీ సజావుగా చెల్లించేలా ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ లోని క్యాంప్ కార్యాలయంలో జీఎస్టీ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి పన్ను చెల్లింపు దారులు సక్రమంగా జీఎస్టీ చెల్లించేలా కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ కు సహకరించాలని అధికారులను ఆదేశించారు.. రిజిస్టర్ చేసుకోకుండా వ్యాపారాలు చేసేవారు, కాంట్రాక్టర్లను రిజిస్ట్రేషన్ చేయించి జిఎస్టి పన్ను చెల్లించేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. జిఎస్టి చట్ట ప్రకారం డిఫాల్టర్ల ప్రాపర్టీస్ ను గుర్తించి, రికవరీ చేయించడంలో రెవిన్యూ శాఖ అధికారులు కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ల కు తగిన సహకారం అందజేయాలని ఆదేశించారు. అలాగే నకిలీ డాక్యుమెంట్ల తో అక్రమ రవాణా చేసే వారి విషయంలో మైనింగ్ శాఖ, రవాణా శాఖ అధికారులు కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ తో సమన్వయంతో పని చేయాలని సూచించారు. అలాగే ఇంజనీరింగ్ శాఖలు ఆయా శాఖలకు సంబంధించిన కాంట్రాక్టర్లు జిఎస్టి పన్ను సక్రమంగా చెల్లించేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ప్రైవేట్ సంస్థలు, ఔట్సోర్సింగ్, ఇతర ప్రభుత్వ శాఖల్లో పని చేసే ఉద్యోగులు ప్రొఫెషనల్ టాక్స్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.. ఆయా శాఖలకు సంబంధించి జీఎస్టీ పన్ను చెల్లింపు పై సంపూర్ణ అవగాహన కోసం సంబంధిత శాఖల అధికారులతో ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ కమర్షియల్ ట్యాక్స్ అధికారులను ఆదేశించారు. ప్రతి నెల సమన్వయ సమావేశాన్ని నిర్వహిస్తా మని, ఆ లోపు ఆయా ప్రభుత్వ శాఖలు ఎందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు .సమావేశంలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ సుధాకర్ రావు, డిప్యూటీ కమిషనర్ సురేష్, ఇంచార్జి డిఆర్ఓ వెంకటేశ్వర్లు, హౌసింగ్ పిడి చిరంజీవి, డ్వామా పిడి వెంకటరమణయ్య, పత్తికొండ ఆర్డీఓ భరత్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, డీపీఓ భాస్కర్, గనుల శాఖ అధికారి రవిచంద్, డిటిసి శాంత కుమారి, తదితరులు పాల్గొన్నారు.