NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యోగ ప్రాణమయ కోశాతో అర్ధంతర చావుల నివారణ

1 min read

యోగ శక్తి సాధన సమితి

 విజయవాడ , న్యూస్ ​నేడు : నగరంలోని మెరిస్టెల్లా కాలేజీ ఆవరణలో (కోవే )కాన్ఫిడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంట్రప్రేన్యూర్ కార్యాలయము నందు జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి కానూరు విజయలక్ష్మి అధ్యక్షత వహించగా,ఆంధ్ర ప్రదేశ్  ఖాది విలేజ్ ఇండస్ట్రీస్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వి రవికుమార్  ముఖ్య అతిథిగా విచ్చేశారు.పి ఎం మోడీ ఫిట్నెస్ మంత్ర అవగాహన కార్యక్రమాన్ని యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ నిర్వహిస్తూ ‘యోగ ప్రాణమయ కోశాను’వాడకం ద్వారా అర్దంతర చావులు తగ్గించవచ్చునని తెలిపారు.మోడీ ఫిట్నెస్ మంత్రాలోని బేర్ ఫుట్ వాక్,చేతి ఆక్యుప్రెషర్,చెవుల మర్దన,ప్రాణాయామ మరియు మెడిటేషన్ ఎలా చేయాలో నేర్పి,ఇలాంటి ప్రాణ శక్తి పెరగటం తో అర్థంకర చావులు తగ్గుతాయని తెలిపారు.ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సిపిఆర్ ఆక్యుప్రెషర్ విభా గానికి,ప్రాణ శక్తి పెంపుకు సంబంధించినదే అని ఇలాంటి భారతీయ వైద్యాన్ని ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న డాక్టర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.అలాగే మోడీ ఫిట్నెస్ మంత్ర కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రచారానికి సహకరించవలసిందిగా డాక్టర్స్ ను కోరాటమైనది.ముఖ్యఅతిథి రాష్ట్ర ఖాది ఇండస్ట్రీస్ సీ ఎ ఓ రవికుమార్ మాట్లాడుతూ ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకునే వారికి సర్టిఫికెట్లు,సబ్సిడీలు,శిక్షణ అందిస్తామని చెప్పి మోడీ ఫిట్నెస్ మంత్ర అందరికీ మంచిదని,జీవితకాలం వాడుతూ ఆరోగ్యంగా ఉండమని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఇండస్ట్రీస్ వారు, కోవే మరో కార్యదర్శి సుశీల,మాజీ ప్రెసిడెంట్ రాజమణి అడ్వైజరీ బోర్డ్ మాలతి, హోమియో డాక్టర్ స్వాతి మరియు  స్టాఫ్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *