ఆర్.డి.టి సంస్థ.. ఎఫ్సిఆర్ఏ చట్టంలో ఉన్న ఆంక్షలు ని వెంటనే ఎత్తివేయాలి
1 min read
హోళగుంద మండల గ్రామ ప్రజల డిమాండ్…
న్యూస్ నేడు హొళగుంద: మనదేశంలో1969 వ సంవత్సరము నందు స్పెయిన్ దేశపు విన్సెంట్ ఫెర్రర్ ( ఆర్డిటి) రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధినేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు జిల్లాలోని రాయలసీమ ప్రాంతంలో మొదట అనంతపురం జిల్లాలో ఆర్ డి టి సంస్థను ఏర్పాటు చేసి ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలు వెనకబడిన గ్రామాలను గుర్తించి వారి ఆర్థికా భివృద్ధికి సహాయ పడాలని సదుద్దేశంతో.. ఆర్థిక అభివృద్ధి విద్యా, వైద్యం ఇతర మౌలిక సదుపాయాలు ఆసుపత్రిలో ఉచిత వైద్యము అందించుట ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడము ఆర్డిటి యొక్క ముఖ్య ఉద్దేశం… అందులో భాగంగా హొళగుంద మండల చుట్టుపక్కల గ్రామాలలో వెనకబడ్డ వర్గాలు ఎస్సీ,ఎస్టిలను తండాలను గుర్తించి16 సంవత్సరాలుగా ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న ఆర్ డి టి (ఎఫ్ సి ఆర్ ఏ) నిధుల్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడం జరిగింది.. కావున ఎఫ్ సి ఆర్ ఏ చట్టంలో ఉన్న ఆంక్షలు ఎత్తి వేయాలని కొగిలాతోట, మార్లమడికి, ఎల్లార్తి, చిన్నహ్యట, గ్రామ ప్రజలు హొళగుంద మండల తాసిల్దార్ నిజాముద్దీన్ కి వినతి పత్రం అందజేశారు… ఈ కార్యక్రమంలో భాస్కర్, గోవర్ధన్, బసవరాజ్, చెన్నప్ప, వీరేష్, తారనాథ్, మండల ప్రజలు పాల్గొన్నారు.