విద్య మాఫియాకు అడ్డుకట్టు వేయాలని అడిగితే మా పైన దాడుల??
1 min read
రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యులు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులే??
రాష్ట్రవ్యాప్తంగా శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీ అరికట్టాలనీ ఎమ్మిగనూరు పట్టణంలో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ లో ఫర్నిచర్ ధ్వంసం: ఏఐఎస్ఎఫ్
ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడి అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలో శ్రీ చైతన్య కళాశాల వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు పైన దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలని రాష్ట్రవ్యాప్తంగా శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీ అరికట్టాలనీ కోరుతూ ఎమ్మిగనూరు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య స్కూల్ లో ఫర్నిచర్ ధ్వంసం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శి విష్ణు, అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్య మాఫియా ఫీజుల దోపిడీ పుస్తకాల వ్యాపారం అరికట్టాలని విజయవాడ పట్టణంలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజు రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయికుమార్ పైన పోలీసులు దాడి చేయడానికి ఖండించారు విద్యార్థి నాయకుల పైన దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.. ఫీజుల దోపిడీ అరికట్టమని అడిగితే విద్యార్థి నాయకుల పైన దాడులు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.. రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యులు దాదాపు 90% పైగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులవే ఉన్నాయన్నారు. విద్య మాఫియా అరికట్టాలని విద్యాదోపిడి ఆపాలని శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకుల పైన దాడి చేసి అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు దాడి చేసిన ఎస్ఐ శంకర్ కానిస్టేబుల్ వీరులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సమీర్, ఆజి బాబు, భార్గవ్, గిరి, సురేష్,రవి, మహేష్, తదితరులు పాల్గొన్నారు.