యోగా ఆరోగ్యానికి చాలా ముఖ్యం అందరూ యోగా చేయండి
1 min read
బి.వీరభద్ర గౌడ్
న్యూస్ నేడు ఆలూరు : ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా విశాఖ వేదికగా 3.19 లక్షల మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా మనదేశ ప్రధానమంత్రి .నరేంద్రమోదీ హాజరుకావడం జరిగింది. ఇందులో భాగంగా ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం నందు ఆలూరు ఎంపీడీఓ ఆధ్వర్యంలో పెద్దఎత్తున యోగా కార్యక్రమంనిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిలుగాఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బి.వీరభద్ర గౌడ్ అలాగే స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ కలెక్టర్ అజయ్ కుమార్ ఇతర ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.ఈకార్యక్రమాన్ని ఉద్దేశించిఇంచార్జి వర్యులు మాట్లాడుతూ యోగా ఆరోగ్యానికి చాలా ముఖ్యం అందరూ యోగా చేయాలని తెలియజేశారు.ముఖ్యంగా ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు, ప్రజలు,విద్యార్థులు,యువత తాలూకా స్థాయి వివిధ హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు,అలాగే తెలుగుయువత,ఐటిడిపి, టియన్ఎస్ఎఫ్ ,టిఎన్టియుసి ,టిడిపి శోషల్ మీడియా అలాగే టిడిపి అనుబంధ సంఘాల నాయకులు,మండల యూత్ నాయకులు అందరూ పెద్దఎత్తున పాల్గొన్నారు.
