NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలి

1 min read

నాణ్యమైన,నమ్మకం కలిగిన, చౌక విద్యుత్తును ప్రతి గృహ యజమాని తయారు చేసుకుని వినియోగించుకోవాలి

విద్యుత్తుశాఖ సూపర్డెంటు ఇంజనీరు పి.సల్మాన్ రాజు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  :స్థానిక రామచంద్రారావు పేట విద్యుత్తు సౌధ సమావేశ మందిరంలో సోమవారం పాత్రికేయుల సమావేశాన్ని విద్యుత్ శాఖ సూపర్డెంటు ఇంజనీరు పి.సల్మాన్ రాజు  నిర్వహించారు.ఈ సందర్భంగా పి.సాల్మన్ రాజు మాట్లాడుతూ ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన పధకంలో భాగముగా గృహ విద్యుత్ వినియోగ దారులకు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం ఒక గొప్ప  సువర్ణఅవకాశం అని ప్రతి గృహ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ప్రతి ఒక్కరూ ఇంటిపై సోలార్ ప్యానల్స్ ను సబ్సిడీపై ఏర్పాటు చేసుకోవాలని, అన్ని జాతీయ బ్యాంకులు తక్కువ వడ్డీకే సులభ వాయిదాలలో చెల్లించేలా లోను సౌకర్యము కల్పించుచున్నారని తెలిపారు.గృహ విద్యుత్ వినియోగ దారులను ప్రోత్సహించటానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ పానెల్స్ ఏర్పాటుకు మెదటి మరియు రెండవ కిలోవాట్ కి ప్రతి కిలోవాట్ కి రూ.30 వేలు,రెండు కిలో వాట్ రూ 60 వేలు, మూడవ కిలోవాట్ కి రూ 78 వేల రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వటం జరుగుచున్నదని తెలిపారు.గృహ విద్యుత్ వినియోగదారులు సోలార్ పానెల్స్ ఏర్పాటు చేసుకున్న తరువాత నెలకు మూడు కిలోవాట్ ఉన్నవారు 432 యూనిట్లు గరిష్టముగా ఉత్పతి చేయవచ్చు నని,దీని వల్ల కరెంటు బిల్లు నందు సుమారు రూ.2,860 వరకు ఆదా చేసుకోనచ్చునని తెలిపారు. అంతేకాకుండా మనము వినియోగించిన యూనిట్లుకు పోను మిగిలిన యూనిట్లు ఏమైయినా ఉంటే వాటికి అదనముగా ప్రతీ యూనిట్ కు రూ.2.09 పైసలు చొప్పున డిపార్టుమెంటు వారు తిరిగి చెల్లించెదరని అన్నారు.ఈ విధముగా మన యొక్క విద్యుత్ బిల్లు తగ్గించు కోవడమే కాకుండా అదనముగా ఉత్పతి చేసిన విద్యుత్ ను అమ్ము కోనవచ్చునని తెలిపారు.ఈ పధకంలో ఇప్పటివరకు 20,507 గృహ విద్యుత్ వినియోగదారులు నమోదు చేసుకున్నారని వారిలో 2108 గృహ విద్యుత్ వినియోగ దారులు 7.00 MW కెపాసిటీ గల సోలార్ పానెల్స్ ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.

మొట్టమొదటిగా ఆంధ్ర ప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణి సంస్థ వారి ఆద్వర్యములో ద్వారకా తిరుమల గ్రామము నందు పైలట్ ప్రాజెక్ట్ క్రింద 750 Kwp సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయుటకు ప్రయత్నములు జరుగుచున్నాయని తెలిపారు.జిల్లాకు సంబందించి 5 మోడల్ సోలార్ విలేజ్ తీర్చి దిద్దుటకు గాను ద్వారకా తిరుమల,దుగ్గిరాల,చిననిండ్రకొలను,తడికలపూడి, యర్రంపేట ఎంపిక చేయుట జరిగినది అని అన్నారు. ప్రధాన మంత్రి కుసుమ పధకంలో భాగముగా జిల్లాలో ప్రయోగాత్మకముగా రెండు వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు సంబందించిన వినియోగదారులను పెదవేగి మరియు టి.నరసాపురం మండలముల యందు ఎంపిక చేసి వారికి సోలార్ పానెల్స్ ను ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్ ను అందించటం జరిగినది అని తెలిపారు.ప్రధాన మంత్రి కుసుమ పధకంలో భాగముగా వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉదయం పూట ఉచిత నాణ్యమైన 9 గంటల విద్యుత్ ను అందించటానికి గాను జిల్లాలో వ్యవసాయ విద్యుత్ ఫీడర్లు సోలరైజేషన్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగు చున్నాయని అన్నారు. ఇందులో భాగముగా సుమారు 115.46 ఏకరాలు పరిశీలించటం జరిగిందని అన్నారు. సౌరశక్తిని వినియోగించడం వలన పర్యావరణ ప్రభావితం చేసే కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే కాకుండా పర్యావరణమునకు ఎంతో మేలు చేసినవారము అవుతామని తద్వారా ఆరోగ్యకరమైన జీవితముతో పాటు స్థిరమైన భవిష్యత్తుకు దోహదం చేసినవారు అవుతామని తెలిపారు.ఈ పథకం రాష్ట్రంలోనే ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని,ఈ పథకాన్ని మరింత ముందు తీసుకోవాల్సిన బాధ్యత ప్రింటు & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ వంతు బాధ్యతను నిర్వహించాలని విద్యుత్తు శాఖ సూపర్డెంటు ఇంజనీరు పి.సల్మాన్ రాజు కోరారు.పాత్రికేయుల సమావేశంలో ఇఇ ఏ.రాధాకృష్ణ, డిఇ,నోడల్ అధికారి ఏ.రమాదేవి, సహాయక ఇంజనీరు ఏ.సంజయ్ కుమార్, సోలారు  వెండర్లు సి.హెచ్.సతీష్ కుమార్,టెల్ టవర్ కిషోర్, యంవియస్ సోలార్ సురేష్, గ్రేస్ సోలార్ ఆనంద్, విద్యుత్ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *