NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డ్రోన్లు సహాయంతో రహదారి ప్రమాదాల నివారణ

1 min read

ట్రాఫిక్ నియంత్రణ కొరకు ద్విచక్ర వాహనాల వినియోగం చేస్తున్న  జిల్లా పోలీసుల సరికొత్త ముందడుగు

ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ వెల్లడి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఏలూరు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను పర్యవేక్షించి, ఉక్కుపాదం మోపేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ విస్తృత చర్యలు చేపడుతున్న జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పోలీస్ వ్యవస్థను మరింత వేగవంతం చేయడం లక్ష్యంగా ఏలూరు జిల్లా పోలీస్ యంత్రంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రినారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత,రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్త  ఆదేశాల మేరకు,డయల్ 112 సేవల మరియు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కొరకు మరింత సమర్థవంతమైన వినియోగం కోసం జిల్లాకు ప్రత్యేకంగా ద్విచక్ర వాహనాలు (హైటెక్ బైకులు) కేటాయించబడ్డాయి.బుధవారం ఏలూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులకు అధికారికంగా అప్పగించి  ఏలూరు జిల్లా ఎస్పీ  స్వయముగా ద్విచక్ర వాహనం నడిపించి ర్యాలీగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి అమీనాపేట గవర్నమెంట్ హాస్పిటల్ ఫైర్ స్టేషన్ జిల్లా పరిషత్ ఆఫీసు మరియు ఇండోర్ స్టేడియం మీదుగా జిల్లా పోలీస్ కార్యాలయముకు చేరుకున్న ద్విచక్ర వాహన ర్యాలీ.డయల్ 112 సేవల్లో వేగవంతమైన స్పందన అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112 ద్వారా సమాచారం ఇచ్చిన నిమిషాల వ్యవధి లోనే సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు సహాయం అందించడంలో పోలీస్ సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.డ్రోన్ పర్యవేక్షణ ద్వారా ట్రాఫిక్ నియంత్రణ కొరకు వేగనిరోధానికి మరియు రహదారి ప్రమాదాల నివారణ కొరకు నిత్యం ద్వారా పర్యవేక్షిస్తూ ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ప్రమాద స్థలాలకు చేరుకునే విధంగా ఈ వాహనాల యొక్క వినియోగం ఉంటుందని, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు వద్ద మరియు అసాంఘిక కార్యకలాపాల నివారణ కొరకు,  రహదారి ప్రమాదాల నివారణ కొరకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సంఘటన స్థలాలకు త్వరితగతిన చేరుకోవడం కోసం అందించబడిన ఈ ద్విచక్ర వాహనాలు పోలీసుల మొబిలిటీని మెరుగుపరచడంలో కీలకంగా నిలవనున్నాయి.ఆధునిక సాంకేతికతతో శక్తివంతమైన గస్తీ సేవలు:ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుత రాత్రివేళ గస్తీలకు, చిన్న వీధులలో సులభంగా చొచ్చుకుపోవడానికి ఈ బైకులు ఉపయోగపడతాయని అన్నారు. వాహనాల్లో అమర్చిన కెమెరాలు మరియు టెక్నాలజీ సపోర్ట్ ద్వారా సంఘటన స్థలాల ఫుటేజ్ ను నమోదు చేసి, ఆధారాలు సేకరించడానికి వీలవుతుందని,ప్రమాద స్థితుల్లో బాధితులకు రక్షణ కల్పించేందుకు, త్వరిత చర్యలకు ఇది వినియోగించనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అడ్మిన్ఎన్ సూరి చందర్రావు,డిటిసి డిఎస్పి ప్రసాద్, ఏ ఆర్ డి ఎస్ పి చంద్రశేఖర్,ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, ఏ ఆర్ ఆర్ ఐ పవన్ కుమార్,డిసిఆర్బి ఇన్స్పెక్టర్ హబీబ్ భాషా, ఏలూరు త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కోటీశ్వరరావు,హెడ్ కానిస్టేబుల్ శానం రమేష్ బాబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *