PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విశ్వబ్రాహ్మణులకు.. ఎమ్మెల్సీ ఇవ్వాలి

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: విశ్వబ్రాహ్మణుల అభ్యన్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు విశ్వ బ్రాహ్మణ జిల్లాగౌరవ అధ్యక్షులు మదన మోహన్ ఆచారి. ఆదివారం కర్నూలు పట్టణంలో విశ్వబ్రాహ్మణుల ముఖ్య సమావేశం జరిగింది. విశ్వబ్రాహ్మణ కులానికి నామినేటెడ్​ పదవీలో భాగంగా ఎంఎల్​సీ కేటాయిస్తామని సీఎం జగన్​మోహన్​ రెడ్డి మాట ఇచ్చారని, మాట ప్రకారం ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని తీర్మానం చేశారు. అదేవిధంగా విశ్వబ్రాహ్మణుల అభ్యన్నతికి సంక్షేమ ఫలాలు అందించాలన్నారు. ఎమ్మెల్సీ పదవిపై జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరికీ వినతిపత్రం అందజేస్తామన్నారు. సమావేశంలో నాయకులు ధనుంజయ ఆచారి,రంజిత్ కర్ణి, శ్రీనివాస్ ఆచారి పార్వతమ్మ, కృష్ణవేణమ్మ,సహదేవ ఆచారి,శివ శంకర్ ఆచారి, సుమంత్ ఆచారి ఇతర సంఘ నాయకులు పాల్గొన్నారు.

About Author