PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు..!!

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ పరిగెల మురళీకృష్ణ  సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆదోని నియోజకవర్గ సమన్వయకర్త జి.రమేష్ యాదవ్  ఆధ్వర్యంలో ఆదోని నియోజకవర్గం అమరావతి నగర్, చిన్న పెండేకల్ నుంచి ఎం రాజగోపాల్ రావు మరియు రఘునాథ్ యాదవ్ ల వారి అనుచరవర్గంతో సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగెల మురళీకృష్ణ  పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు, కాంగ్రెస్ నాయకులు పీజీ నరసింహులు యాదవ్, ఎం కాశీం వలి, మురళీ కృష్ణంరాజు, ఎస్ ప్రమీల మొదలగు నాయకులు పాల్గొన్నారు.

About Author