PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులు పంట మార్పిడి తప్పనిసరి చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  రైతులు ప్రతి సంవత్సరం పంట మార్పిడి తప్పని సరిగా చేయాలని మండల ఏఓ జీరా గణేష్ సూచించారు. బుధవారం మండల పరిధిలోని కల్లుదేవకుంట, సుంకేశ్వరి, మాలపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. కల్లుదేవకుంట గ్రామంలో  శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయ వనరుల శాఖ అధికారులు  వెంకటేశ్వర్లు, ఏడీఏ శశిధర్ రెడ్డి, ఏఓ రైతులతో చర్చించారు.  సుంకేశ్వరి, మాలపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట మార్పిడి చేస్తేనే అధిక దిగుబడులు వస్తాయని తెలిపారు. వర్షాల వల్ల పంట నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సూక్ష్మ సేద్యం పై అవగాహన తీసుకోవాలని సూచించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *