PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ ఎంపీలు ప్రథమ చికిత్స వరకే  రోగులను చూడాలి

1 min read

ప్రభుత్వ వైద్య అధికారిణి వాణిశ్రీ

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్యాపిలి పట్టణంలోని ఆర్ ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే రోగులను చూడాలని   ప్యాపిలీ ప్రభుత్వ వైద్య అధికారిణి వాణిశ్రీ తెలిపారు.ఈసందర్భంగా గురువారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డాక్టర్. వాణిశ్రీ  ఆధ్యర్యం లో ఆర్ ఎం పి, పి ఎం పి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే వారికి మీటింగ్ నిర్వహిస్తూ ప్రథమ చికిత్స వరకే వచ్చిన రోగులకు చూడాలి అని స్థాయికి మించి చేయకూడదు అని, డబ్బులు ముఖ్యం కాదని మనషుల ప్రాణాలు ముఖ్యమని, అవసరం అయిన కేసులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నకు పంపవలెను అని, ఏ వైన పిర్యాదులు వస్తే రిజిస్టర్ చేసుకొని పై అధికారులకు నివేదిస్తే వారు చర్యలు తీసుకొంటారని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో ఆరోగ్య విద్యా భోదకుడు రాఘవేంద్ర గౌడు, మనోహర్ రెడ్డి, ఆసుపత్రి సిబ్బంది అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *