79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో ఆగస్టు 15: దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిప్పగిరిలో గ్రామ సచివాలయం నందు మరియు, శ్రీభోగేశ్వర దేవాలయం నందు మహాత్మా గాంధీ విగ్రహాని పూలమాల వేసి అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి…. *ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర్య స్ఫూర్తిని కాపాడుకుంటూ ప్రజలందరూ దేశాభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు బుసినే శ్రీరాములు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు, మరియు జిల్లా కమిటి సభ్యులు, జడ్పిటిసి, కన్వీనర్, కో కన్వీనర్, ఎంపీపీ, విద్య కమిటి చైర్మన్,వైస్ ఎంపీపీ, మాజీ విద్య కమిటి చైర్మన్,సర్పంచ్, ఎంపీటీసీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


