PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి సభ్యత నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

1 min read

ఎమ్మెల్యేతో పాటు 15 మంది శాశ్వత సభ్యత్వం నమోదు చేసుకున్నారు

సీనియర్ కార్యకర్త మునీరుద్దీన్ కు ఘన సన్మానం

కార్యకర్తలకు అండ, భరోసా తెలుగుదేశం పార్టీ

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  పట్టణంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ దివంగత నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ , సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంతో రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీడీపీ సభ్యత్వం  నమోదు కార్యక్రమాన్ని ఎమ్మిగనూరు నియోజవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు సీనియర్ కార్యకర్తగా కొనసాగుతున్న మునిరుద్దీన్ కు ఎమ్మెల్యే ఆయనకు మొదటి సభ్యత్వం ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఆయనకు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారి మాట్లాడుతూ తనతో పాటు 15 మంది శాశ్వత సభ్యత నమోదు చేసుకోవడం జరిగింది అని తెలిపారు. గతం కంటే ఎమ్మిగనూరు నియోజవర్గం తరఫున ఎక్కువ సభ్యత్వం నమోదుకు శ్రీకారం చుడుతామన్నారు. కార్యకర్తలకు అండ, భరోసా కల్పించే పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ అని, కార్యకర్తల సంక్షేమానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *