గాయపడ్డ జనసేన మధు సుధాకర్..
1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోనిచౌట్కూరు గ్రామానికి చెందినజనసేన పార్టీ యువకులు రోళ్లగొట్టు మధు సుధాకర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.గ్రామానికి చెందిన వెంకటస్వామి కుమారుడు మధు ఓర్వకల్లు మండలం శకునాల గ్రామంలో ఉన్న సోలార్ లో విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా కాల్వబుగ్గ దారిలో బైక్ అదుపుతప్పి కింద పడడంతో కాలు,చేయికి బలంగా గాయాలు అయ్యాయి.కర్నూలు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.జనసేన పార్టీ మండల యువకులు ప్రభాకర్వారి ఇంటికి వెళ్లి మధును పరామర్శించారు.మధు జనసేన పార్టీ సభ్యత్వంచేయించడం జరిగిందని జనసేన పార్టీ తరపున ఆర్థిక సహాయం వచ్చేందుకు పార్టీ ఆఫీస్ కు ఆస్పత్రి రిపోర్టర్ ను పంపడం జరిగిందని ప్రభాకర్ తెలిపారు.ప్రభాకర్ తో పాటు ఆలీం భాష పరామర్శించారు.

